రాజధాని ప్రజలకు చల్లటి కబురు

     Written by : smtv Desk | Fri, Apr 05, 2019, 10:59 AM

రాజధాని ప్రజలకు చల్లటి కబురు

హైదరాబాద్: సూర్యుడి తాపంతో అల్లాడిపోతున్న రాజధాని ప్రజలకు చల్లటి కబురు. పశ్చిమ విదర్భ నుంచి కోస్తా కర్ణాటక వరకు మరాఠ్వాడ, మధ్య మహారాష్ట్ర మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక రాజధానిలోని పలుచోట్ల ఉరుములు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.





Untitled Document
Advertisements