నిజామాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ ఎంపి కవిత బాల్కాండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...మరో రెండు నెలలో ఇక్కడి పేదలందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తం. సొంత జాగా ఉన్నవాళ్లు ఇండ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తమని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి..పంటలకు గిట్టుబాటు ధర వచ్చేట్లు చేస్తమన్నారు. ఈవీఎంలు ఎక్కువ ఉన్నాయని అయోమయానికి గురి కావొద్దని ఓటర్లకు కవిత సూచించారు. మొదటి ఈవీఎంలో రెండో స్థానంలోనే కారు గుర్తుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి, జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.