రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో తల్లీ, కూతురు మృతిచెందిన సంఘటన నాచారం సమీపంలో శుక్రవారం జరిగింది. లాలాపేటకు వెళ్లేందుకు నాచారానికి చెందిన కొంత మంది మహిళలు నడుచుకుంటూ వెళ్లి రైల్వే ట్రాక్ను దాటుతున్నారు. వారితోపాటు వెళ్లిన రేష్మ(19), కూతురు(14 నెలలు) రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. రేష్మ అక్కడికక్కడే మృతిచెందగా, కూతురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. రైలు పట్టాలు దాటకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాల్సిన రైల్వే అధికారుల వల్లే తల్లీ, కూతురు మృతిచెందినట్లు స్థానికులు ఆరోపించారు.