నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ

     Written by : smtv Desk | Fri, Apr 12, 2019, 07:16 PM

నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు తాజాగా నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేసింది. శాసనమండలి విలీనం వ్యవహారంలో వివరణ ఇవ్వాలని ప్రభాకర్‌రావు, సంతోష్‌కుమార్‌, ఆకుల లలిత, దామోదర్‌ రెడ్డిలకు ఉన్నత న్యాయస్థాణం నోటీసులు ఇచ్చింది. శాసనమండలి ఛైర్మన్‌, కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ శాసనమండలి పక్షాన్ని టిఆర్‌ఎస్‌ శాసనమండలి పక్షంలో విలీనం చేయాలని గతంలో కాంగ్రెస్‌కు చెందిన ఈ నలుగురు ఎమ్మెల్సీలు స్వామిగౌడ్‌కు లేఖ ఇవ్వగా దాన్ని ఆమోదించారు. విలీనాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. విలీనాన్ని ఆమోదిస్తూ మండలి జారీచేసిన బులెటిన్‌ చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. విలీనం పేరుతో పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలపై పిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్ధానం వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.





Untitled Document
Advertisements