న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల హైకోర్టు కొత్త జడ్జిల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపి హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం సిఫార్సులో పేర్కొన్నారు. ఏపి హైకోర్టుకు భానుమతి, మానవేంద్రనాథ్రాయ్, వెంకటరమణ, హరిహరనాథ్ శర్మ, పేర్లను సిఫార్సు చేశారు. తెలంగాణ హైకోర్టుకు పి.శ్రీసుధ, పి.సుమలత, ఎన్ తుకారాంజి పేర్లు సిఫార్సు చేశారు.