స్వల్పంగా పెరిగిన బంగారం ధర...వెండి మాత్రం

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 12:41 PM

స్వల్పంగా పెరిగిన బంగారం ధర...వెండి మాత్రం

శుక్రవారం(ఆగస్ట్16) పసిడి ధర స్వల్పంగా పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరుగుదలతో రూ.37,010కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ స్వల్పంగా పెరగడంతో ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.35,770కు చేరింది. బంగారం ధర స్వల్పంగా పెరిగితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.585 పెరుగుదలతో రూ.47,850కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.37,710కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.36,510కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర భారీగానే పెరిగింది. రూ.585 పెరుగుదలతో రూ.47,850కు చేరింది.





Untitled Document
Advertisements