ఏపీలో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అక్టోబరు, నవంబరులో నెలల్లో నిర్వహించనున్న వివిధ ప్రధాన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ తాజాగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీపీఎస్సీ వాయిదా వేసిన పరీక్షల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, గెజిటెడ్ పోస్టులు, పాలిటెక్నిక్ లెక్చరర్, నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుల మెయిన్ పరీక్షలు ఉన్నాయి. ప్రశ్నపత్రాల తయారీ, ఇతర అంశాలకు సంబంధించి సమయం పడుతుండటంతో ఏపీపీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి తాజా షెడ్యూలును అక్టోబరు 22న ప్రకటించనున్నట్లు కమిషన్ ప్రకటించింది.