టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా గతేడాది వచ్చిన సినిమా 'టాక్సీవాలా'. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్. ఎన్నో అవాంతరాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. అయితే టాక్సీవారా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా బాలీవుడ్ రీమేక్పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా విజయ్ దేవరకొండతోనే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ సినిమా భారీ విజయం కాకపోవటంతో విజయ్ ఆ ఆలోచన విరమించుకున్నాడు. తరువాత పలువురు బాలీవుడ్ హీరోలు ఈ రీమేక్లో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి.అయితే తాజాగా ఈ రీమేక్ విషయంలో క్లారిటీ వచ్చింది. టాక్సీవాలా రీమేక్ను ఇషాన్ ఖట్టర్ హీరోగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. జీ స్టూడియోస్, ఏఏజెడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 11 ప్రారంభమైంది. ఖాలీ పీలి పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో ఇషాన్ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. జైదీప్ అహ్లవత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మక్బూల్ ఖాన్ దర్శకుడు.