శుభవార్త...భారీగా దిగొచ్చిన బంగారం ధర

     Written by : smtv Desk | Thu, Apr 02, 2020, 11:14 AM

శుభవార్త...భారీగా దిగొచ్చిన బంగారం ధర

పసిడి వెలవెలబోతోంది. బంగారం ధర తగ్గుతూనే వస్తోంది. ఈరోజు కూడా బంగారం ధర మళ్లీ తగ్గింది. పసిడి ధర దిగిరావడం ఇది వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా మన దేశంలో పసిడి ధర దిగిరావడం గమనార్హం.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.39,510 నుంచి రూ.39,440కు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.80 తగ్గుదలతో రూ.43,160 నుంచి రూ.43,080కు క్షీణించింది.


పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.460 పెరిగింది. దీంతో వెండి ధర రూ.39,940కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.


ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. మళ్లీ 1600 డాలర్ల పైకి వచ్చేసింది. పసిడి ధర ఔన్స్‌కు 0.51 శాతం పెరుగుదలతో 1600.35 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరుగుదలతో 14.03 డాలర్లకు ఎగసింది.


దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70 తగ్గుదలతో రూ.40,940కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.80 క్షీణతతో రూ.43,210కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.460 పెరుగుదలతో రూ.39,940కు చేరింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Untitled Document
Advertisements