న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: రిలయన్స్ జియో ఆఫర్ ల మోతకు దేశీయ మొబైల్ తయారీ కంపెనీలు వాటి బాట మార్చుకుంటూనే ఉన్నాయి. తాజాగా వోడాఫోన్ చైనాకు చెందిన ఐటెల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఎంట్రీలెవల్ స్మార్ట్ఫోన్ ‘ఐటెల్ ఏ20’ ని అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.3690 లుగా ఉండగా, రూ. 2,200 క్యాష్బ్యాక్ తో రూ. 1,590 లకే ఈ స్మార్ట్ఫోన్ను అందిస్తోంది. అయితే ఇందుకోసం నెలకు రూ. 150 చొప్పున 36 నెలల పాటు కస్టమర్లు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తొలి 18 నెలలు పూర్తయిన తర్వాత రూ. 900, చివరి 18 నెలలు పూర్తయిన తర్వాత రూ. 1200 క్యాష్ బ్యాక్ ఇస్తుంది.
ఐటెల్ ఏ20 ఫీచర్లు
* 4 అంగుళాల డిస్ప్లే
* ఆండ్రాయిడ్ నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్
* 1జీబీ ర్యామ్
* 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 2 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
* 0.3 మెగాపిక్సెల్ ముందు కెమెరా
* 1700 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం