బండ్లగూడ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి అధికారులు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు. పోచారంలో సోమవారం నిర్వహిస్తున్న ఫ్లాట్ల అమ్మకం జోరుగా కొనసాగింది . బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు వచ్చాయి . జూబ్లీహిల్స్ అంబేద్కర్ వర్సిటీలో ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు.కాగా.. లాటరీ ప్రక్రియను ఫేస్బుక్, యూట్యూబ్లలో లైవ్ స్ట్రీమింగ్ చేయబబో తున్నారు . ఇవాళ బండ్లగూడ 1,2 బీహెచ్కే, బుధవారం బ ండ్లగూడ 3 బీహెచ్కేలోని ప్లాట్లకు లాటరీ తీస్తారు . అయితే, ఈ పూర్తి ప్రక్రియను హెచ్ఎండీఏ అధికారులు రికార్డ్ చేయడం కాకుండా.. ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయించనున్నట్లు అధికారులు తెలియచేస్తున్నారు . ఆధార్ సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలిపారు .