మనం ఆహారం తీసుకునే తప్పుడు మొదటి ముద్దని నెయ్యితో లేదా ఏదైనా ఒంటికి పుష్టిని చేకూర్చే పోడులతో తినమని మన పెద్దలు చెప్పడం మనం తరుచుగా వింటూనే ఉంటాము. అటువంటి ఒంటి పుష్టిని చేకూర్చే పదార్థమే 'మృతమరీచి'.
'మృతమరీచి' అనే ఆహార పదార్ధాన్ని భోజనంలో మొదటి ముద్దగా తిని, ఆ తర్వాత మీకు ఇష్టమైన పదార్థాలు తినండి!
'మృతమరీచి' పేరు గంభీరంగా చిత్రంగా ఉంది కాదు.. ఏమీలేదు వెరీ సింపుల్. మిరియాల్ని తేలికగా దంచి, నేతిలో వేయించి, వడగట్టిన నెయ్యిని మృతమరిచి అంటారు. మృతం అంటే నెయ్యి ! మరీచి అంటే మిరియాలని అర్థం.
నోటికి సంబంధించిన వ్యాధులు, గొంతుకు సంబంధించిన వ్యాధులు, దర్మవ్యాధులున్నవారు ముఖ్యంగా దీన్ని తినాలి.
దీని వలన బుద్ధిబలం పెరుగుతుందని చదువుకునే పిల్లలకు తప్పనిసరిగా పెట్టమని మన ప్రాచీన ఆయుర్వేద వైద్యుల సలహా!