'హనుమాన్' చిత్రాన్ని ప్రశంసిస్తూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్

     Written by : smtv Desk | Tue, Jan 30, 2024, 03:25 AM

'హనుమాన్' చిత్రాన్ని ప్రశంసిస్తూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్

సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాలలో హీరో తేజా సజ్జా నటించిన హనుమాన్ చిత్రం ఒకటి. పెద్ద హీరోల సినిమాలను వెనక్కి నెట్టి కలెక్షన్ల పరంగా దుసుకేలుతుంది.ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తేజా సజ్జా ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద కూడా సందడి చేస్తోంది. కాగా, హనుమాన్ సినిమాని తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీక్షించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

"హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో నేడు హనుమాన్ చిత్రాన్ని స్నేహితులతో కలిసి వీక్షించాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన ఆంజనేయస్వామి స్ఫూర్తిగా రూపొందించిన ఈ చిత్రంలోని ప్రతి ఘట్టం ఆకట్టుకుంది. సినిమా నిర్మాణ విలువలు, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయి. ఈ సినిమాలో తేజా సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, ఇతర నటుల నటన ఆకట్టుకుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి, దర్శకుడు ప్రశాంత్ వర్మకు, ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు" అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.





Untitled Document
Advertisements