గద్దర్ పేరిట అవార్డులు అందిస్తామన్న రేవంత్ రెడ్డి.. మోహన్ బాబు స్పందన

     Written by : smtv Desk | Fri, Feb 02, 2024, 03:35 PM

గద్దర్ పేరిట అవార్డులు అందిస్తామన్న రేవంత్ రెడ్డి.. మోహన్ బాబు స్పందన

తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరిట రాష్ట్ర అవార్డులను అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ నటుడు మోహన్ బాబు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. సంస్కృతిని గుర్తించడంపై వారికున్న నిబద్ధతకు ఇదొక నిదర్శనమని కొనియాడారు.
గద్దర్ పాటలు సమాజంలో మార్పును తీసుకొచ్చేందుకు ఎంతో దోహదపడ్డాయని చెప్పారు. గద్దర్ అవార్డులను ఇవ్వడం.. సంగీతం, పాటల ద్వారా సమాజ మార్పు కోసం ఆయన చేసిన కృషి, త్యాగాలకు గొప్ప గౌరవమని అన్నారు. వ్యక్తిగతంగా ఇది తనకొక గొప్ప అనుభూతి అని చెప్పారు. గతంలో గద్దర్ కు శాలువా కప్పి సత్కరిస్తున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. మోహన్ బాబు షేర్ చేసిన ఫోటోలో ఆయనతో పాటు పెద్ద కొడుకు విష్ణు కూడా ఉన్నారు.





Untitled Document
Advertisements