క్యాన్సర్ తో నటి పూనమ్ పాండే మృతి.. తెలుగులోనూ ఓ సినిమాలో పూనమ్

     Written by : smtv Desk | Fri, Feb 02, 2024, 09:11 PM

క్యాన్సర్ తో నటి పూనమ్ పాండే మృతి..  తెలుగులోనూ ఓ సినిమాలో పూనమ్

తమ అందంతో అభిమానులను ఆకట్టుకునే తారల జాబితాలో ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే గట్టిగానే వినిపిస్తుంది. ఆమె నటించిన సినిమాలు వేళ్ళమీద లెక్కించవచ్చు కానీ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫొటోలు, వీడియోలు రసికులను అలరించేలా వేరే లెవెల్లో ఉంటాయి. సినిమాల కంటే ఫొటో షూట్లతోనే ఆమె చాలా బిజీగా ఉంటారు. అటువంటి ఫెమ్ ఉన్న పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించారు. ఏమైనా గానీ, క్యాన్సర్ తో పూనమ్ పాండే మృతి చెందారన్న వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. 32 ఏళ్ల వయసుకే ఆమె కన్నుమూయడం అభిమానులను తీవ్ర విషాదానికి గురిచేస్తోంది. కాగా, పూనమ్ పాండే గతంలో ఓ తెలుగు సినిమాలోనూ నటించారు. ఆ సినిమా పేరు 'మాలిని అండ్ కో'. ఈ సినిమాలో 'బిగ్ బాస్' ఫేమ్ సామ్రాట్ హీరో. ఈ చిత్రం 2015లో వచ్చింది. ఆ తర్వాత పూనమ్ పాండే మళ్లీ తెలుగులో నటించలేదు. ఆమె 2013లో 'నషా' అనే బాలీవుడ్ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించారు. బాలీవుడ్ లోనూ ఆమె నటించిన చిత్రాలు తక్కువే.





Untitled Document
Advertisements