ప్రముఖ మోడల్, బాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే మరణించినట్టుగా నిన్న సోషల్ మీడియా నిండా కొన్ని వార్తలు చెక్కర్లు కొట్టాయి. అయితే నటి పూనమ్ సంచలన ప్రకటన చేసింది. నేను చనిపోయిన వార్త నిజం కాదు నేను ఇంకా చనిపోలేదు..బతికే ఉన్నానని వెల్లడించింది పూనమ్ పాండే. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది నటి పూనం పాండే.సర్వైకల్ క్యాన్సర్ పై చాలామంది మహిళలకు సరైన అవగాహన లేదు… అందుకే మహిళలకు అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్టు ప్రచారం చేసినని ఆమె వెల్లడించారు. కానీ తాను చనిపోలేదని… బతికే ఉన్నట్టు తెలిపారు. దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని పూనం పాండే వెల్లడించారు.