రాజకీయ ప్రముఖుడు, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రధాని నరెంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు అద్వానీకి శుభాకాంక్షలు తెలియజేసారు. తాజాగా ఆయనను అవార్డు వరించడం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. అద్వానీ భారతరత్నకు నిస్సందేహంగా అర్హులు అంటూ పేర్కొన్నారు. మన భారత దేశం చూసిన అత్యంత విశిష్టమైన రాజనీతిజ్ఞుల్లో ఆయన ఒకరు అని కొనియాడారు. స్వాతంత్రానికి ముందు నుంచీ.. అనేక దశాబ్దాలుగా దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అమూల్యమైనదన్నారు. అద్వానీ వంటి దిగ్గజ నాయకులు.. రాజకీయాల యొక్క.. రాజకీయ నాయకుల యొక్క స్థాయిని మరియు గౌరవాన్ని పెంచారని పేర్కొన్నారు. అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ భారతరత్నకు ఎంపికైన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో ఆయనను గౌరవించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ విషయాన్ని ప్రధాని శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీంతో అద్వానీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.