స్టార్ హీరోయిన శ్రీదేవి మరణంపై తప్పుడు పత్రాలు క్రియేట్ చేసిన మహిళపై ఛార్జిషీట్‌ దాఖలు.. సీబీఐ

     Written by : smtv Desk | Mon, Feb 05, 2024, 09:21 AM

స్టార్ హీరోయిన శ్రీదేవి మరణంపై తప్పుడు  పత్రాలు క్రియేట్ చేసిన మహిళపై ఛార్జిషీట్‌ దాఖలు.. సీబీఐ

అలనాటి అందాల తార శ్రీదేవి 2018లో దుబాయ్‌లో చనిపోయిన విషయం తెలిసిందే.ఆమె చనిపోయి ఏళ్ళు గడిచిన కూడా ఇప్పటికి ఆమెని అభిమానించే వారు అంతే సంఖ్యలో ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో శ్రీదేవి మరణం పై అనుమానులు ఉన్నాయి అంటూ ఓ వ్యక్తి వార్తల్లోకి ఎక్కినా విషయం తెలిసిందే. నటి శ్రీదేవి మరణంపై తాను సొంతంగా విచారణ జరిపానని, యూఏఈ-భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచినట్టు తేలిందంటూ నకిలీ పత్రాలు సృష్టించిన భువనేశ్వర్‌కు చెందిన దీప్తి పిన్నిటిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ విషయాన్ని సీబీఐ ఆదివారం వెల్లడించింది. ఈ పరిణామంపై దీప్తి స్పందించారు. తన వాంగ్మూలం నమోదు చేయకుండానే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా శ్రీదేవి మరణంపై దీప్తి నకిలీ పత్రాలను సృష్టించింది. ఆమె మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై చర్చలు జరిపారు. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి మరణంపై దీప్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఏఈ-భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేఖలతో పాటు సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్ల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి ఇవే సాక్ష్యాలు అంటూ ప్రదర్శించారు. రంగంలోకి దిగిన సీబీఐ దీప్తి చూపిన ప్రధాని, రక్షణ మంత్రి లేఖలు నకిలీవని తేల్చింది. ఇవన్నీ నకిలీ పత్రాలంటూ ముంబైకి చెందిన చాందినీ షా అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.





Untitled Document
Advertisements