ఆ రాష్ట్ర లోక్ సభ ఎన్నికల బరిలోకి తెలంగాణ గవర్నర్ తమిళిసై

     Written by : smtv Desk | Tue, Feb 06, 2024, 10:09 AM

ఆ రాష్ట్ర లోక్ సభ ఎన్నికల బరిలోకి తెలంగాణ గవర్నర్ తమిళిసై

తమిళనాడు చెందిన తమిళిసై సౌందరరాజన్ ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా సేవలను అందిస్తున్నారు. అయితే ఈసారి తమిళ సై తమిళనాడు ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తమిళనాడులోని తూత్తుకుడి లేదంటే విరుదునగర్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 1999లో బీజేపీలో చేరిన తమిళిసై 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన తమిళిసై ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2011 ఎన్నికల్లో వేళచ్చేరి నియోజకవర్గం నుంచి పోటీచేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్‌గా పంపింది. ప్రస్తుతం ఆమె పుదుచ్చేరి ఇన్‌చార్జి ఎల్జీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, తమిళిసై తండ్రి కమరి ఆనంద్‌ తమిళనాడు కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. తండ్రి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే, కూతురు బీజేపీకి అంకితం అయ్యారు.





Untitled Document
Advertisements