రామప్ప గుడిలో పిల్లలకు నాన్వెజ్ వడ్డించిన స్కూల్ టీచర్స్.. నిలదీసిన భక్తుడు

     Written by : smtv Desk | Tue, Feb 06, 2024, 02:38 PM

రామప్ప గుడిలో పిల్లలకు నాన్వెజ్ వడ్డించిన స్కూల్ టీచర్స్.. నిలదీసిన భక్తుడు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అంతా కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకునేదుకు ప్రాకులాడుతుంటే.. అందుకు భిన్నంగా నిత్యం అందుకు భిన్నంగా అనేక సంఘటనలు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా రామప్ప దేవాలయానికి క్రిస్టియన్ మిషినరీ స్కూల్ కు చెందిన పిల్లలను స్కూల్ యాజమాన్యం పిక్నిక్ పేరుతో తీసుకెళ్ళి అక్కడ గుడి ప్రాంగణంలో పిల్లలకు మామ్సాహరపు వంటకాలను వడ్డించారు. గుడిలో పిల్లలకు మాంసాహారం వడ్డించడం చూసిన ఓ వ్యక్తి ఇదేంటి ఇది గుడి కదా ఇక్కడ మీరు మాంసాహారం ఎలా వడ్డిస్తారు? మీరు పిల్లలను గుడికి తీసుకొచ్చి వారికి నాన్వెజ్ వడ్డించి ఎం నేర్పాలి అనుకుంటున్నారు అంటూ గట్టిగా నిలదీశారు. అందుకు టీచర్ స్పందిస్తూ మాకు తెలియదు కదండీ అని చెప్పడం విచిత్రంగా తోచింది. మీరు మా పిల్లలకు క్రిస్టియానిటి నేర్పిస్తున్నారా మీరు అంటూ మండిపడ్డారు? గుడికి వచ్చిన మిగితా భక్తులు సైతం అతని వాక్యాలు సమర్దిస్తూ స్కూల్ యాజమాన్యం తీరుని తప్పు బట్టారు. వీడీయోలోని మాటలను బట్టి వరంగల్ భీమారంలోని బాలజ్యోతి స్కూల్ గా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విడీయో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నేట్టిజన్లు అన్న గుడ్ జాబ్ , బాగా అడిగావు, ఇకమీదట మన పిల్లలను మిషినరీ స్కూల్ లకు పంపకూడదు అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.





Untitled Document
Advertisements