తవ్వకాలలో వెయ్యేళ్ల నాటి విష్ణు విగ్రహం.. అయోధ్య బాల రాముడిని పోలి ఉండడం విశేషం

     Written by : smtv Desk | Thu, Feb 08, 2024, 06:54 AM

తవ్వకాలలో వెయ్యేళ్ల నాటి విష్ణు విగ్రహం.. అయోధ్య బాల రాముడిని పోలి ఉండడం విశేషం

తాజాగా కృష్ణా నదిలో వెయ్యేళ్ల నాటి నాటి విష్ణు విగ్రహం కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. కర్ణాటకలో రాయచూర్ జిల్లాలోగల కృష్ణా నదిలో బయటపడిన ఈ విగ్రహం అయోధ్య బాల రాముడి విగ్రహాన్ని పోలి ఉండటం సంచలనంగా మారింది. దేవసుగూరు గ్రామ సమీపంలో నదిపై వంతెన నిర్మాణ పనులు చేపడుతుండగా ఈ విగ్రహం బయటపడింది.

విష్ణు విగ్రహంతో పాటు శివలింగం కూడా లభ్యమైంది. ఇక విష్ణువిగ్రహం చుట్టూ దశావతారాలన్నీ కనిపిస్తున్నాయి. ఈ విగ్రహానికి అనేక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డా.పద్మజా దేశాయ్ తెలిపారు. నిలబడి ఉన్న భంగిమలో ఉన్న ఈ విగ్రహం ఆగమశాస్త్రాలల్లోని మార్గదర్శకాలకు అనుగూణంగా ఉందని చెప్పారు. వెయ్యేళ్ళ నాటి విగ్రహం ఇప్పుడు లభించడంతో విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఆనందాశ్చర్యాలకు గురవుతున్నారు.





Untitled Document
Advertisements