ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రజలను దోచుకునేందుకు సెలబ్రిటీల పేర్లను సైతం వాడుకుంటున్నారు . తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు కూతురు ఘట్టమనేని సితార పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె పేరుపై ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతాలు సృష్టించి ఇన్వెస్టిమెంట్, ట్రేడింగ్ లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా ఆ లింకులపై క్లిక్ చేస్తే వారి ఖాతాలు గుల్లయినట్టే.
ఈ లింకులను గుర్తించిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి లింకులను నమ్మవద్దని, సెలబ్రిటీల పేరుతో వచ్చే ఇలాంటి లింకులపై క్లిక్ చేసి కష్టాలపాలు కావొద్దని సూచించింది. ఫోన్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఎంతో అప్రమర్తంగా ఉండాల్సిందే. లేదంటే అంతా గల్లంతే