స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ ఎట్టకేలకు పెళ్ళి పీటలు ఎక్కబోతుంది. ప్రొడ్యూసర్, నటుడు జాకీ భగ్నాని వివాహం చేసుకోబోతున్నారు. రకుల్ ప్రీత్సింగ్, జాకీ భగ్నానీ ఈ నెల 21న వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుపు, నీలం రంగుల్లో ఉన్న ఈ శుభలేఖలో మండపం చుట్టూ కొబ్బరి చెట్లను సముద్రం బ్యాక్డ్రాప్లో ముద్రించారు. అలాగే కార్డుపై ‘అబ్దోనోభగ్నా-ని’అన్న హ్యాష్ట్యాగ్ను కూడా ప్రింట్ చేశారు.
కొన్ని సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్న రకుల్, జాకీ తమ వివాహానికి గోవాను ఎంచుకున్నారు. దీనివెనక కూడా ఓ కారణం ఉంది. వారిద్దరూ లవ్లో పడింది ఇక్కడేనట. జాకీ 2009లో ‘కల్ కిస్నే దేఖా’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఫాల్తు, అజాబ్ గజాబ్ లవ్, రాంగ్రేజ్, యంగిస్థాన్ వంటి సినిమాల్లో నటించాడు.
2009లోనే కన్నడ సినిమా గిల్లీతో రకుల్ ప్రీత్సింగ్ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత యారియాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అనంతరం దేదే ప్యార్ దే, రన్వే 34, చాత్రివాలీ, ఐ లవ్ యూ, డాక్టర్ జీ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి అభిమానుల మనసులు చూరగొంది.