మరో జేఈఈ విద్యార్థి ఆత్మహత్య.. కోటాలో ఘటన

     Written by : smtv Desk | Tue, Feb 13, 2024, 12:11 PM

మరో జేఈఈ విద్యార్థి ఆత్మహత్య.. కోటాలో ఘటన

జేఈఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్‌ రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లోకి ఎక్కింది. రాజస్థాన్ రాష్ట్రం కోటాలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఇది నాలుగో కేసు కాగా, గతేడాది 29 మంది ప్రాణాలు తీసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు.

12వ తరగతి చదువుతూనే జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి తాజగా తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటికి ఫోన్ చేసే కుమారుడి నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో అనుమానించి, వార్డెన్‌కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వార్డెన్ వెళ్లి చూస్తే విద్యార్థి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టానికి తరలించారు.





Untitled Document
Advertisements