హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మంగళవారం అర్ధరాత్రి బైక్‌పై వెళుతున్న సీఐ దుర్మరణం

     Written by : smtv Desk | Wed, Feb 14, 2024, 10:11 AM

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..  మంగళవారం అర్ధరాత్రి  బైక్‌పై వెళుతున్న సీఐ దుర్మరణం

మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ దుర్మరణం చెందగా ఎస్సై గాయాలపాలయ్యారు. ఎల్బీనగర్‌లో ఓ కారు యూటర్న్ తీసుకుని రాంగ్ రూట్‌లో వెళుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సీఐ సాధిక్ అలీ మృతిచెందారు. ఎస్సై కాజా వలీ మోహీనుద్దీన్‌ గాయాలపాలయ్యారు. సాధిక్‌ అలీ చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తుండగా, కాజా వలీ నారాయణ గూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో చేస్తున్నారు. మలక్‌పేట క్వార్టర్స్‌లో ఉండే వీరిద్దరూ మంగళవారం సాయంత్రం ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి కారణమై కారు వినుషా శెట్టి అనే పేరుపై రిజిస్ట్ అయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఛలాన్లు కూడా ఉండటం గమనార్హం. ప్రమాదం జరిగాక కారు అక్కడి నుంచి పారిపోయినట్టు కూడా వెలుగులోకి వచ్చింది. యాక్సిడెంట్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు.





Untitled Document
Advertisements