బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎన్నికలలో ఓటమి పాలై ప్రతిపక్షంగా మిగిలిన తరువాత తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. నల్గొండలో నిన్న నిర్వహించిన ‘చలో నల్లగొండ’సభలో అధికార కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. నీటి కొరకు మరోసారి ఉద్యమానికి సై అన్నారు. ఈ సభకు అశేషంగా తరలివచ్చిన జనాన్ని చూసి బీఆర్ఎస్ నేతలు ఆనందంలో మునిగిపోయారు.
కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి, కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి సహా పలువురు అగ్రనేతలు హాజరయ్యారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్కు బయలుదేరిన పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మార్గమధ్యంలో చౌటుప్పల్ వద్ద రోడ్సైడ్ కేఫ్లో చాయ్ తాగేందుకు ఆగారు. లోపలికి వస్తున్న కేటీఆర్ను చూసిన జనం కాసేపు తమనుతాము నమ్మలేకపోయారు. కేఫ్లో టీ తాగిన కేటీఆర్ కొద్దిసేపు స్థానికులతో ముచ్చటించారు. కేటీఆర్ రాకతో హోటల్లో సందడి నెలకొంది. అనంతరం హైదరాబాద్కు బయలుదేరారు. కొందరు అభిమానులు ఆయనతో ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ విడీయోను చుసిన నేట్టిజనులు తమ అభిమాన లీడర్ గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు.
ఛలో నల్గొండ భారీ బహిరంగ సభ విజయవంతం అనంతరం హైదరాబాద్ కు తిరుగివస్తుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చౌటుప్పల్ వద్ద ఓ హోటల్ లో చాయ్ తాగి. కొద్దిసేపు స్థానికులతో ముచ్చటించారు.@KTRBRS అన్న ❤️
mdash;
pic.twitter.com/lIm23y1iaZ