పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లిన దీది.. ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటన

     Written by : smtv Desk | Sat, Feb 24, 2024, 08:03 AM

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లిన దీది.. ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై తృణమూల్ పార్టీ తిరిగి తమతో టచ్‌లోకి వచ్చిందని, సర్దుబాట్ల పై చర్చలు జరుగుతున్నాయంటూ .. ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకంపై ఫుల్ క్లారిటీ వచ్చింది కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్ ఈ విషయాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే తృణమూల్ కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంపై తమ పార్టీ అధినేత్ర, సీఎం మమతా బెనర్జీ కొన్ని వారాల క్రితమే స్పష్టత ఇచ్చారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ డెరెక్ డెరెక్‌ ఓబ్రిన్ ప్రకటించారు. అసోంలోని కొన్ని సీట్లు, మేఘాలయలోని తురా లోక్‌సభ స్థానంలో పోటీ విషయంలో కూడా ఎలాంటి మార్పు లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్ కోరుతున్న స్థానాల సంఖ్యను 5కు తగ్గించుకున్నా తృణమూల్ కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. తృణమూల్‌కు అసోంలో 2, మేఘాలయలో ఒక సీటును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కాంగ్రెస్ ఆఫర్ చేసినా తలోగ్గలేదని సమాచారం.

ఇండియా కూటమికి ఎదురుదెబ్బ
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన ఇండియా కూటమికి ఎదురుదెబ్బ అని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకొని మిగతా రాష్ట్రాలపై కాంగ్రెస్ దృష్టిసారించిన వేళ జరిగిన ఈ పరిణామాన్ని ప్రతికూలంగా పరిగణించాలని అంటున్నారు. కాగా ఢిల్లీ, హర్యానా, గోవా, గుజరాత్‌లలో పోటీపై గత కొన్ని రోజులుగా ఆప్‌తో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. మరి కాంగ్రెస్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి అనేది వేచిచూడాల్సిందే.





Untitled Document
Advertisements