ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ తరుపూనా పోటి చేసే అభ్యర్థుల జాబితాలను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఏపీలో జనసేన మరియు టీడీపీ ఇరు పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగుతున్నట్టుగా ప్రకటించి అందుకు తగిన విధంగా అభ్యర్థులను సైతం ఖరారు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అమలాపురం నియోజక వర్గం టికెట్టు జనసేన ఇంచార్జ్ సెట్టిబత్తుల రాజబాబుకు కేటాయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అమలాపురం టికెట్ తనకు కేటాయించారని జరుగుతున్న ప్రచారంపై సెట్టిబత్తుల రాజబాబు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా అమలాపురం టికెట్ జనసేనకు ఇచ్చారని, ఈ టికెట్ ను రాజబాబుకు కేటాయించారని మంగళవారం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో అమలాపురం జనసైనికులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ వేచి ఉండాలని రాజబాబు కార్యకర్తలకు సూచించారు.
ఈమేరకు ట్విట్టర్ లో ఓ వీడియో సందేశం విడుదల చేశారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆఫీసు నుంచి అధికారికంగా ప్రకటన విడుదలయ్యాక సంబరాలు చేసుకుందామని చెప్పారు. ముందే సంబరాలు చేసుకుంటూ అత్యుత్సాహం ప్రదర్శించవద్దని జనసైనికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం తాడేపల్లిగూడెంలో జరగబోయే టీడీపీ- జనసేన సభను విజయవంతం చేయడంపైనే జనసైనికులంతా దృష్టి పెట్టాలని రాజబాబు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే తెలుగు జన విజయకేతన సభకు తరలిరావాలంటూ జనసేన కార్యకర్తలు, నేతలు, టీడీపీ శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే అధిష్టానం అధికారికంగా ప్రకటించే వరకు అసలు విషయం తెలిసే అవకాశం లేనట్టే.
మీడియా కథనాలతో కార్యకర్తలు అత్యత్సాహం ప్రదర్శించవద్దు అధ్యక్షులు @PawanKalyan గారు @ncbn గారు @JanaSenaParty @mnadendla గారు అధికారికంగా ప్రకటించేవరకు సంయమనం పాటించాలి pic.twitter.com/O1cRPyl2hn
mdash; Settibathula Rajababu (@srb4people) February 28, 2024