ఎన్నికల ముంగిట మరో వైసీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు

     Written by : smtv Desk | Wed, May 01, 2024, 12:57 PM

ఎన్నికల ముంగిట మరో  వైసీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు

ఎన్నికల ముంగిట అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం కొరకు ప్రజా క్షేత్రంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించడం అనేది మాములుగా జరిగే విషయమే. అయితే ఇటువంటి విమర్శ అనేది సాధారణంగా ఉంటె పరవాలేదు. కానీ వ్యక్తిగత దూషణలకు పాల్పడితే మాత్రం కేసులు తప్పవు. తాజాగా ఇదే విషయంలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కొత్తూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని.. ఆయనపై కేసు నమోదు చేయాలని ఎంపీడీవో సాయిలహరి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మరి పోలీసులు ఈ కేసు విషయంలో ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు అనేది చూడాలి.





Untitled Document
Advertisements