ఎక్స్ వేదికగా ఈ వస్తువులు దగ్గర ఉంచుకోండి అని ప్రజలకు సూచించిన కేటీఆర్

     Written by : smtv Desk | Thu, May 09, 2024, 11:21 AM

ఎక్స్ వేదికగా ఈ వస్తువులు దగ్గర ఉంచుకోండి అని ప్రజలకు సూచించిన  కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరచిపోకుండా ఈ ఆరు వస్తువులను సమకూర్చుకోవాలని ఆయన చెప్పారు. ఇన్వర్టర్, ఛార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, క్యాండిల్స్, జనరేటర్స్, పవర్ బ్యాంక్స్ లను దగ్గర పెట్టుకోవాలని సూచించారు. సిక్స్ గ్యారంటీస్ అని ఎద్దేవా చేశారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. మే 13వ తేదీన ప్రజలంతా తెలివిగా ఓటు వేయాలని సూచించారు. ఓట్ ఫర్ కార్, కేసీఆర్ ఫర్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్ లను తన కామెంట్ కు జత చేశారు.
https://twitter.com/KTRBRS/status/1788421051883385182?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1788421051883385182%7Ctwgr%5E86c3da00984aa8667df1861eca42f59c20b53e51%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F801104%2Fktr-suggests-people-to-keep-6-things-with-them





Untitled Document
Advertisements