ప్రియురాలు దూరం పెట్టిందని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు

     Written by : smtv Desk | Thu, May 09, 2024, 01:04 PM

ప్రియురాలు దూరం పెట్టిందని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు

ఈ మధ్యకాలంలో లీవ్ ఇన్ రిలేషన్స్, లవ్ ఎఫైర్స్ అనేది చాలా కామన్ విషయాలుగా మారిపోయాయి. ప్రేమలో ఉన్నప్పుడు పార్టనర్ నే సర్వస్వం అనుకుని ప్రేమ మత్తు తొలగిపోగానే నువ్వెవరో నేనెవరో అంటూ దూరం పాటిస్తుంటారు. అయితే ఇద్దరు తమ రిలేషన్ ని లైట్ తీసుకుంటే సమస్య ఉండదు. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు తమ బంధాన్ని సీరియస్ గా తీసుకున్నా అవతలి వ్యక్తి తమని దూరం పెట్టడాన్ని తట్టుకోలేరు. అలా ప్రేమించిన ప్రియురాలి దురాన్ని తట్టుకోలేక ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి ఉరేసుకున్నాడో యువకుడు. హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన 29 ఏళ్ల ఇమ్రోజ్ పటేల్ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడంతో ఇమ్రోజ్‌ను కొంతకాలంగా యువతి దూరం పెట్టింది.

తీవ్ర మనస్తాపానికి గురైన ఇమ్రోజ్ మంగళవారం రాత్రి తన ఫ్లాట్ నుంచి యువతికి ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చెప్పడంతో ఆమె షాకైంది. వెంటనే అక్కడికి సమీపంలోనే ఉండే స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతడు ఇమ్రోజ్ ఫ్లాట్‌కు వెళ్లి చూసేసరికే ఘోరం జరిగిపోయింది. దుప్పటితో ఉరివేసుకున్న ఇమ్రోజ్ విగత జీవిగా కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements