మరోసారి సావిత్రిగా కీర్తిసురేష్..!!

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 01:18 PM

మరోసారి సావిత్రిగా కీర్తిసురేష్..!!

హైదరాబాద్, జూలై 16 : దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్‌. భారీ అంచనాల నడుమ మొదలైన ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వంవహిస్తుండగా.. ఎన్‌బీకే ఫిల్మ్స్‌ పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు ఎవరనే విషయంపై రోజుకో వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అలాగే ఈ చిత్రంలో ఎన్నార్ పాత్రలో ఆయన మనువడు అక్కినేని నాగచైతన్య నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సీనియర్ హీరో రాజశేఖర్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సావిత్రి పాత్రలో మరోసారి కీర్తి సురేశ్ ను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమె ఎంపిక ఖరారైపోయిందనేది సినీవర్గాల నుంచి అందుతోన్న సమాచారం.

'మహానటి' చిత్రంలో సావిత్రిగా కీర్తి నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఇప్పుడు ఆ పాత్రలో కీర్తిని కాకుండా మరో కథానాయికను ఊహించలేరు. అందుకని సావిత్రి పాత్ర కోసం మరోసారి కీర్తి నటించనుందన్నమాట. ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటలో రకుల్ కనిపించనుందనే వార్త కూడా బలంగానే వినిపిస్తోంది. మరి ఈ విషయంపై చిత్రయూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.





Untitled Document
Advertisements