గనుల రంగంలో ఆదాయం గణనీయం, అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 11:39 AM

గనుల రంగంలో ఆదాయం గణనీయం, అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెరాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గనుల రంగంలో ఆదాయం గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం పాటించిన పారదర్శక మైనింగ్ విధానంతో రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట పడిందని తెలిపారు.

ఇంతకుముందు 2004-14 మధ్యకాలంలో ఏటా రూ.3.94 కోట్ల చొప్పున ప్రభుత్వానికి రూ.39.4 కోట్ల ఆదాయం మాత్రమే అందిందని అన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన 2014-18 మధ్యకాలంలో మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఆదాయం ఏకంగా రూ.1,600 కోట్లకు చేరుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఆదాయం 100 రెట్లు పెరిగిందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో కేటీఆర్ ప్రశంసించారు.





Untitled Document
Advertisements