ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతుంది. అంటే జోరుగా బెట్టింగులు సైతం కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఐపీఎల్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న సంఘటనలు కూడా కోకొల్లలు పోలీసులు ఎన్నిరకాల భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమాలను అడ్డుకోలేకున్నారు. తాజగా ఐపీఎల్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న సాప్ట్వేర్ ఇంజినీర్ సహా మరొకరిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 100 టికెట్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన చిత్తూరు రమణ, హైదరాబాద్కు చెందిన శామ్యూల్ సుశీల్కు వాట్సాప్ ద్వారా స్నేహం కుదిరింది. ఐపీఎల్ మ్యాచ్లకు ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకోవాలని భావించిన వీరిద్దరూ ఆన్లైన్ ద్వారా ఇతరుల ఐడీలతో టికెట్లు కొనుగోలు చేస్తున్నారు.
ఆ తర్వాత వాటిని బ్లాక్లో అధిక ధరలకు విక్రయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. వీరి బ్లాక్ మార్కెట్ దందాపై సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ ఉదయం వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.