గత రెండు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 పెరుగుదలతో రూ.33,060కు చేరింది. అదే సమయంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.60 పెరుగుదలతో రూ.31,160కు పెరిగింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర స్వల్పంగా రూ.10 పెరుగుదలతో రూ.39,860కు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధర పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 0.26 శాతం పెరుగుదలతో 1,340.25 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్కు 0.14 శాతం పెరుగుదలతో 14.77 డాలర్లకు ఎగసింది.