అఫ్గనిస్తాన్: శుక్రవారం ఉదయం హిందూకుష్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూకంపం రావడంతో భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలిసింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.