మల్కాజిగిరిలో 65 తులాల బంగారం చోరీ

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 03:51 AM

మల్కాజిగిరిలో 65 తులాల బంగారం చోరీ

మల్కాజిగిరిలో ఓ భారీ చోరి జరిగింది. ఓ ఇంట్లోని వ్యక్తులు ఊరెళ్ళి వచ్చే సరికి ఇళ్ళు గుల్ల అయిన సంఘటన మల్కాజిగిరి లో జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి బంగారం దోచుకుని పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మౌలాలిలోని షఫీ నగర్‌లో నివాసముండే గౌళీకర్ మోహన్ ప్రైవేట్ ఉద్యోగి. ఈనెల 15న కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని మాణిక్యమ్మ ఆశ్రమానికి వెళ్ళాడు. 16వ తేదీన ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగుల గొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి చూడగా ఆల్మారిలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో పాటు అందులో ఉన్న 65 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు నిర్థారించుకుని మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements