* భారత్లో వాల్మార్ట్ సంస్థ 50 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థను పునర్ వ్యవస్థీకరించాలన్న ఉద్దేశంతో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా వాల్మార్ట్ తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించడంలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28 వాల్మార్ట్ మాల్స్ ఉన్నాయి. వాటిల్లో కేవలం చిన్న షాపుల వాళ్లకు మాత్రం సరుకులను అమ్ముతారు. రిటేల్ వినియోగదారులకు సరుకులను అమ్మరు. కంపెనీకి చెందిన రియల్ ఎస్టేట్ విభాగంలో పనిచేసే 50 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. వ్యాపారం అంతా ఈ-కామెర్స్ వైపు మళ్లడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.