డయాబెటిస్‌ బాధితులు చేపలు తినొచ్చా?

     Written by : smtv Desk | Sat, Oct 30, 2021, 03:09 PM

డయాబెటిస్‌ బాధితులు చేపలు తినొచ్చా?

మధుమేహం లేదా డయాబెటీస్ ఈ వ్యాధిబారిన పడినవారి జీవితం నరకప్రాయమే అనిచెప్పవచ్చు. నచ్చిన ఆహారాన్ని తినలేక ఇబ్బంది పడాలి. శరీరంపై ఏమైనా పుండ్లు, గాయాలు ఏర్పడినా సరే అంత త్వరగా నయం కావు. అయితే, కొన్ని ఆహారాల ద్వారా డయబెటీస్‌ను కంట్రోల్‌లో పెట్టుకోవచ్చని ఆహార, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చేపలు డయాబెటీస్ బాధితులకు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.
❂ డయాబెటీస్ వల్ల కంటిచూపు కూడా మందగిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి వారినికి కనీసం రెండుసార్లు చేపలు తింటే ఆయా సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్యులు తెలుపుతున్నారు.
❂ వారానికి రెండుసార్లు చేపలు తింటే 500 మిల్లీ గ్రాముల ఒమేగా-3 శరీరానికి అందుతుందట.
❂ ఒమేగా ఆమ్లాలు మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో క్రియాశీలంగా వ్యవహరిస్తాయి.
❂ ఒమేగా-3 పుష్కలంగా ఉండే చేపలను తినడం ద్వారా కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చు.
చేపలు డయాబెటీస్ బాధితులకు మేలు చేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఈ స్టడీలో భాగంగా పరిశోధకులు 55 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసున్న 3,614 మంది టైప్‌–2 మధుమేహ రోగులకు వారానికి 500 మిల్లీగ్రాముల ఒమేగా-3 ఆమ్లాలను ఆహారంగా ఇచ్చారు. దీంతో వారిలో డయాబెటిస్‌ వల్ల ఏర్పడే దుష్ఫలితాలు 48 శాతం వరకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

మనం తినే ఆహారంలో కూడా చక్కెర ఉంటుంది. మోతాదుకు మించిన ఆహారం తిన్నట్లయితే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగిపోతాయి. దాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యం శరీరానికి లేకపోతే క్రమేనా మధుమేహంలోకి దించేస్తుంది. మనం తిన్న ఆహారం ద్వారా శరీరానికి అందే అదనపు చక్కెర కాలేయంలో నిల్వ ఉంటుంది. మనం భౌతికంగా శ్రమించినప్పుడు శరీరానికి అవసరమైన శక్తి చక్కెర ద్వారా లభిస్తుంది. అంటే, కాలేయంలో ఉండే చక్కెర శరీరానికి అందుతుంది. అయితే, కాలేయం సామర్థ్యాన్ని మించిన చక్కెరలను నిల్వ ఉంచలేదు. అదనంగా ఏర్పడే చక్కెరలను మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంది. తరచు మూత్రం వస్తుంటే.. తప్పకుండా అది మధుమేహానికి సూచన అని గుర్తించాలి. నిర్లక్ష్యం చేస్తే.. అది కిడ్నీలు (మూత్ర పిండాలు)పై ప్రభావం చూపుతుంది. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి:
❂ మూత్రం ఎక్కువగా వస్తుంది.
❂ దాహం ఎక్కువగా వేస్తుంది. గొంతు ఎండిపోతున్నట్లు ఉంటుంది.
❂ అకారణంగా బరువు తగ్గడం, బాగా నీరసం.
❂ చూపు మందగిస్తుంది.
❂ పంటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు వస్తాయి.
❂ శరీరంపై గాయాలు త్వరగా మానవు.
❂ అతిగా ఆకలి వేస్తుంది.
❂ కాళ్లలో స్పర్శ తగ్గుతుంది.
❂ కొంతమందికి కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి.
❂ రక్తంలో చక్కెరల స్థాయులు నిర్ధారిత మోతాదుకు మించి పెరిగితే మధుమేహం ఉన్నట్లే.
❂ కొందరిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు.
❂ వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం.
❂ శృంగార కోరికలు సన్నగిల్లడం.
❂ చర్మం ముడత పడటం.
❂ టైప్-2 డయాబెటిస్ తొలిదశలో గుర్తించడం కష్టం. రక్త నాళాలు, మూత్రపిండాలు, గుండె సమస్యలు వచ్చిన తర్వాతే ఎక్కువ మంది గుర్తిస్తారు.





Untitled Document
Advertisements