తొమ్మిదో సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ జరుగుతున్న విష్యం తెలిసిందే. అయితే ఈ సీజన్ లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. నిన్న అనగా గురువారం జరిగిన సెమీఫైనల్లో జైపూర్ 49–29 స్కోరు తేడాతో బెంగళూరు బుల్స్ ను ఓడించింది. తమ యజమానులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ల సమక్షంలో జైపూర్ ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరు కనబరిచారు. రైడింగ్, ట్యాకిల్ పాయింట్లలో సత్తా చాటి తమదైన శైలీలో దూసుకుపోతూ మ్యాచ్ ను ఏకపక్షం చేశారు. జైపూర్ తరఫున రైడర్ అజిత్ కుమార్ 13 రైడ్ పాయింట్లతో చెలరేగాడు.
డిఫెండర్ షావుల్ కుమార్ 10 పాయింట్లు రాబట్టాడు. మరోవైపు బెంగళూరు బుల్స్ అన్ని విభాగాల్లో నిరాశ పరిచింది. ఏ దశలోనూ జైపూర్ కు పోటీ ఇవ్వలేకపోయింది. రైడర్ భరత్ ఏడు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. వికాస్ ఖండోలా (5), నీరజ్ నర్వాల్ (4) కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఇక, ఈ మ్యాచ్ కు జైపూర్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ తమ కూతురు ఆరాధ్య బచన్ తో కలిసి వచ్చారు. ఆటగాళ్లను దగ్గరుండి మరిఉత్సాహ పరిచారు.