హైదరాబాద్, జనవరి 30: విలక్షణ నటుడు కమల్ హసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్' (భారతీయుడు) చిత్రానికి సీక్వెల్ గా రూపొందించనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కమల్ నటించిన చిత్రాలన్ని౦టి కంటే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు కోలివుడ్ వర్గాల సమాచారం.
అయితే ఈ చిత్రంలో కమల్ సరసన నటించే౦దుకు నయనతారను చిత్రబృందం సంప్రదించిందట. ఆమెకు కథ నచ్చడంతో ఒకే చెప్పెసిందని టాక్. ఈ విషయాన్నీ త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా '2.ఓ'ను తెరకెక్కిస్తున్నారు శంకర్.ఈ చిత్ర చివరిదశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.