భారత్ బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఓటమి తప్పించుకోవడం కొరకు బంగ్లాదేశ్ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఓవర్ నైట్ స్కోరు 7/0తో మూడో రోజు, శనివారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 133 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి తొందరగానే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, లిటన్ దాస్, నరుల్ హసన్ అనూహ్యంగా ఎదురుదాడికి దిగారు. దాంతో, బంగ్లా 195/7 స్కోరు టీ విరామానికి వెళ్లింది. ఎప్పుడో ఆలౌటవ్వాల్సిన బంగ్లా.. భారత ఫీల్డింగ్ తప్పిదాల వల్ల ఆటను మూడో సెషన్ కు తీసుకెళ్లింది.
ముఖ్యంగా స్లిప్ లో విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. అతను ఏకంగా మూడు క్యాచ్ లు నేలపాలు చేశాడు. ఈ అవకాశాలను సద్విదియోగం చేసుకున్న లిటన్ దాస్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అతను 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి తోడు తస్కిన్ అహ్మద్ 15 పరుగులతో నిలిచాడు. మొత్తంగా బంగ్లా 108 పరుగుల ఆధిక్యంలో ఉంది.