పంత్ ను ప్రమాదం నుంచి కాపాడిన బస్ డ్రైవర్ కు ప్రశంసల వర్షం..

     Written by : smtv Desk | Sat, Dec 31, 2022, 03:36 PM

పంత్ ను ప్రమాదం నుంచి కాపాడిన బస్ డ్రైవర్ కు ప్రశంసల వర్షం..

శుక్రవారం అనగా నిన్న తెల్లవారుజామున టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్లే జాతీయ రహదారిలో తాను నడుపుతున్న లగ్జరీ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకపోవడంతో పంత్ కారు వెనుకే వస్తున్న హర్యానా రాష్ట్ర రోడ్ వేస్ బస్సు డ్రైవర్.. కారు ప్రమాదాన్ని గమనించి వెంటనే బస్సు నిలిపివేశాడు. కండక్టర్ తో కలసి కిందకు దిగి వెళ్లి చూడగా, ఓ వ్యక్తి కారు డోర్ విండోలో ఇరుక్కుని ఉండడం చూసి బయటకు తీసి పంత్ ను ఆసుపత్రికి తరలించాడు. కాగా ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో బ్రతికి భయటపడ్డ విషయం తెలిసిందే.
ప్రముఖ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో క్షేమంగా బయటపడడానికి సాయపడిన బస్సు డ్రైవర్ సుశీల్, కండక్టర్ పరమ్ జీత్ కు హర్యానా రోడ్ వేస్ అధికారులు ప్రశంసా పత్రాలు, షీల్డ్ ను బహూకరించి, వారిని అభినందించారు. మానవత్వానికి వీరు (డ్రైవర్, కండక్టర్) నిదర్శనమని హర్యానా రాష్ట్ర రవాణా మంత్రి మూల్ చంద్ శర్మ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీరికి చక్కని ప్రశంసలు లభిస్తున్నాయి.





Untitled Document
Advertisements