అనారోగ్య కారణాలతో హైదరాబాదీ మహిళ అమెరికాలో ఆత్మహత్య

     Written by : smtv Desk | Sat, Sep 02, 2023, 10:56 AM

అనారోగ్య కారణాలతో హైదరాబాదీ మహిళ అమెరికాలో ఆత్మహత్య

ప్రస్తుత కాలంలో చిన్నచిన్న కారానాలకు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఉంటున్న ఓ హైదరాబాదీ మహిళ అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే, నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలానికి చెందిన ఏనుగు మల్లారెడ్డి, అనసూయ దంపతులు నగరంలోని ఏల్బీనగర్‌లో కామినేని ఆసుపత్రి వెనుక ఉన్న సూర్యోదయ కాలనీలో ఉంటున్నారు. ఆ దంపతుల కుమారుడు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో సిర్థపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఆయనకు 18 ఏళ్ల క్రితం కవిత(40)తో వివాహమైంది. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో అవస్థలు పడుతున్న కవిత అనారోగ్య సమస్యలతో విసిగిపోయి గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.





Untitled Document
Advertisements