పొన్నూరు నియోజకవర్గంలో కోట్ల విలువైన సంపదను జగన్ ప్రభుత్వం దోచుకుంది.. ధూళిపాళ్ల

     Written by : smtv Desk | Mon, Apr 29, 2024, 01:12 PM

పొన్నూరు నియోజకవర్గంలో కోట్ల విలువైన సంపదను జగన్ ప్రభుత్వం దోచుకుంది..  ధూళిపాళ్ల

ఏపీలో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఎపీలో అధికార వైసీపీ మరియు బీజేపీ,టీడీపీ, జనసేన కూటమి పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటూ ప్రత్యర్థి పార్టీ పై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ల పాలనలో అంతులేని అవినీతి చోటుచేసుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. పొన్నూరు నియోజకవర్గంలోనే రూ. 2,500 కోట్లు పైగా విలువైన సహజవనరులను దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య దళితులను బెదిరించి అనుమర్లపూడిలో వారి భూమిని లాక్కున్నారని అన్నారు. రేషన్ మాఫియా లారీకి అడ్డొచ్చారని ఒక ఉద్యోగిని హతమార్చారని చెప్పారు. పొన్నూరును గంజాయికి అడ్డాగా మార్చారని విమర్శించారు. ఇంత జరిగినా ఎమ్మెల్యేపై జగన్ చర్చలు తీసుకోలేదని చెప్పారు. పొన్నూరులో రోడ్డు విస్తరణ బాధితులకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు.





Untitled Document
Advertisements