చంద్రబాబుకు మద్దతుగా స్పీకర్ సైకిల్ ర్యాలీ..

     Written by : smtv Desk | Thu, Apr 19, 2018, 03:24 PM

చంద్రబాబుకు మద్దతుగా స్పీకర్ సైకిల్ ర్యాలీ..

అమరావతి, ఏప్రిల్ 19 : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక రాష్ట్రం కోసం రేపు నిరాహారదీక్ష చేపట్టనున్న నేపథ్యంలో దీక్షకు సంఘీభావంగా శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు గురువారం సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఈ మేరకు నర్సారావుపేట పట్టణంలోని తన స్వగృహం నుంచి స్వయంగా సైకిల్‌ తొక్కుతూ కోటప్పకొండకు బయలుదేరారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆయనకు హారతి ఇచ్చారు. ముస్లింలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని మరచి, నాలుగేళ్లుగా అదిగోఇదిగో అంటూ ఊరించారని మండిపడ్డారు. కేంద్రం దిగిరావాలంటే ఆంధ్రులు అంటే ఏంటో చూపించాల్సిందే అన్నారు. జ్వరంతో బాధపడుతున్న ఇంత ఎండలో కార్యకర్తలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే సైకిల్ యాత్ర చేశానని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని కోరుకుంటున్నా వాడిలో తానూ కూడా ఒకడినే అంటూ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements