హైదరాబాద్, ఏప్రిల్ 21 : జనసేన అధినేత పవన్ కళ్యాన్ వరుస ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి విషయంపైన ఇంతలా సీరియస్ అవని పవన్.. తన తల్లిని విమర్శించారని ఆరోపిస్తూ.. నిన్న ఫిలింఛా౦బర్ లో నిరసన వ్యక్తం చేస్తూ, ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేడు తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా మెసేజ్ లు పెడుతున్నారు. "నిజాలను నిగ్గు తేల్చుకుందాం.. ఒక మంత్రి, ముఖ్యమంత్రి, ఒకరు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? అంటూ సంచలన ట్వీట్ చేశారు.
ఆయన ఓ 'అజ్ఞాతవాసి', అతనో బ్లాక్ మెయిలర్ అని, స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని 'ఒకరి'తో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, 'ఒకరు' ఎవరు.. తెలుసుకోవాలని ఉందా!! స్టే ట్యూన్డ్! లైవ్ ఫ్రం హైదరాబాద్! 'నిజాలు నిగ్గు తేలుద్దాం' ప్రోగ్రాం నుంచి మీ పవన్ కల్యాణ్. నాకు ఇష్టమైన స్లోగన్ "ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చెయ్యాలి" అసలు ఈ స్లోగన్ వెనుక కథకి ఈ స్లోగన్కి సంబంధం ఏంటి? నిజమైన 'అజ్ఞాతవాసి' ఎవరో మీకు తెలుసా?" అంటూ వరుస ట్వీట్స్ చేశారు పవన్ కల్యాణ్. దీంతో తరువాత ఏం జరగబోతోంది అనే విషయంపై ఆసక్తి నెలకొంది.