ఈ మధ్యకాలంలో విదేశాలలో మరణిస్తున్న భారతీయువిద్యార్థుల సంఖ్య అందరిని కలవర పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలో పైచదువులు పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న తెలంగాణ యువకుడు రుత్విక్ రాజన్ హఠాన్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే, సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీవో తులసీరాజన్ పెద్దకుమారుడు బండా రుత్విక్రాజన్ (30) రెండేళ్ల క్రితం పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్ యూనివర్సిటీలో ఇటీవల ఎమ్ఎస్ పూర్తి చేశారు. ఉద్యోగప్రయత్నాల్లో ఉన్న అతడు స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే అతణ్ణి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. బ్రెయిన్స్ట్రోక్తో ప్రాణాలు విడిచినట్టు చెప్పారు. ఆదివారం రాత్రి మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా కుటుంబసభ్యులు అతడి మృత దేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. యువత ఇలా ఉన్నట్టుండి కుప్పకులిపోతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. చిన్న వయసులో యువత మరణాల భారిన పడడం అందరిని ఆందోళనలకు గురించేస్తుంది.