అరుణ్ గోయల్ రాజీనామా ? మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలి.. ఒవైసీ

     Written by : smtv Desk | Mon, Mar 11, 2024, 02:30 PM

అరుణ్ గోయల్ రాజీనామా ? మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలి.. ఒవైసీ

కొద్దిరోజులలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న విషయం విధితమే. అటువంటి సమయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేయడం రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. రాజకీయాల్లో ఇక్కడ చూసిన ఆయన రాజీనామా విషయమే చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఒత్తిడి కారణంగానే ఆయన రాజీనామా చేశారని విపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ... రాజీనామాకు గల కారణమేంటో గోయల్ పేర్కొనలేదని... అరుణ్ గోయల్ రాజీనామాకు కారణమేంటో కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం తనను షాక్ కు గురి చేసిందని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి పార్లమెంటులో బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. మరి ఒవైసీ వాఖ్యలపై కమలనాధులు ఏవిధంగా స్పందిస్తారు అనేది చూడాలి.





Untitled Document
Advertisements