భద్రాచల రాముడిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

     Written by : smtv Desk | Mon, Mar 11, 2024, 02:30 PM

భద్రాచల రాముడిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

నేటి మధ్యాహన్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకున్నారు.సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క స్వాగతం పలికారు. ఆలయ ఈవో, పండితులు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.





Untitled Document
Advertisements